పేదరికాన్ని తొలగించడమే లక్ష్యం : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Published: Thursday August 05, 2021
శేరిలింగంపల్లి, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ కాలనీ లో అర్హులైన లబ్ధిదారులకు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని తొలగించటం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టారని అందులోని భాగమే ఈ రేషన్ కార్డుల పంపిణీ కూడా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ఉపాధ్యక్షులు యాద గౌడ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, విఆర్ఓ శంకరయ్య, డీలర్ అశోక్, సీనియర్ నాయకులు కలివేముల వీరేశం గౌడ్, ఆంజనేయులు, గణపురం రవీందర్, సుదర్శన్ రెడ్డి, మహేంద్ సింగ్, రాజు, సైదులు, నర్సింహులు, రఘు యాదవ్, రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.