నిరుద్యోగ సమస్య జాబ్ మేళా పరిష్కారం

Published: Saturday June 11, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 10 ప్రజాపాలన ప్రతినిధి. నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగ అవకాశం కల్పనకై ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జాబ్ మేళ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించిన ఎమ్మెల్యే, టీ.ఆర్.ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  మరింత ఉద్యోగ సమస్యలు తీర్చడమే లక్ష్యం పెట్టుకుని జాబ్ మేళా కార్యక్రమంలో దాదాపుగా 500 మంది పదో తరగతి నుండి డిగ్రీ వరకు చదివి ఇంగ్లీష్ వచ్చి ఉండాలని తెలిపారు ఐదు వందల   దరఖాస్తులు రావడం తోటి కొంతమందికైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని  ఎమ్మెల్యే తెలియజేశారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు వారి సమస్యలు తీరుతాయని ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి,  ఎంపీపీ కృపెష్, ఎంపిడిఓ క్రాంతి కిరణ్, ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంపీవో  ఐకెపి రవీందర్, అమేజోన్ మేనేజ్మెంట్ కుల్దీప్, వీరభద్ర రావు, రాజ్ కుమార్, సునీల్ పాట్రా, శ్రీనివాస్.....తదితరులు పాల్గొన్నారు,