ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్లు

Published: Wednesday April 27, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సహోదరుల కోసం ఎం కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక &ఉపాధి కల్పనా శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్లు హరీశంకర్ రెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పప్పుల అంజి రెడ్డి, బండారు రవీందర్, బొడిగె కృష్ణ, జావీద్ ఖాన్, కో అప్షన్ సభ్యులు సేక్ ఇర్ఫాన్, ముస్లిం సోదరులు, నాయకులు పాల్గొన్నారు.