ముఖ్యమంత్రికి గుమస్తా చేస్తున్న పల్లా
Published: Tuesday March 02, 2021
మధిర, మార్చి 1, ప్రజా పాలన ప్రతినిధి: ప్రజల సమస్యలను విస్మరించిన టిఆర్ఎస్ మధిర విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సూట్కేసులు అందిస్తూ, చందాలను సేకరిస్తూ, గుమస్తాగా పని చేస్తూ, ప్రజల సమస్యల విస్మరించారని, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఘాటుగా విమర్శించారు. సోమవారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కనీసం ఎన్నికల హామీలు సైతం అమలు చేయలేదన్నారు. సామాజిక న్యాయాన్ని పాటించి, జనరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎస్టి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములు నాయక్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల రమణ, చావా వేణు, పాల్గొన్నారు
Share this on your social network: