హుజురాబాద్ కు తరలివెళ్ళిన పీర్జాదిగూడ పాలకవర్గం

Published: Tuesday August 17, 2021
మేడిపల్లి, ఆగస్టు16 (ప్రజాపాలన ప్రతినిధి) : హుజురాబాద్లో దళితులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు తరలివెళ్లిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు సుభాష్ నాయక్, కౌడే పోచయ్య, అనంత రెడ్డి, భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, టీఆర్ఎస్ నాయకులు మాడుగుల చంద్రారెడ్డి, పప్పుల అంజిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బండారి రవీందర్, కుర్ర శ్రీకాంత్ గౌడ్ పట్టణ పెద్దలు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వెళ్లారు.