అనాధ ఆశ్రమంలో వృద్ధులకు భోజనం అందించిన హై కేర్ హాస్పిటల్

Published: Thursday October 07, 2021
మధిర, అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో వృద్ధులకు మతిస్థిమితం లేని వారి కొరకు. మధిర రెస్క్యూ టీం వారి సారధ్యంలో నడుస్తున్న ఆర్కె ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో. హై కేర్ హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు. డాక్టర్ జంగా. నవీన్ రెడ్డి, మనీషా పెళ్లి రోజు సందర్భంగా మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని దాని కొరకే పేదలకు అన్నదాన కార్యక్రమం చేసినట్లు వారు తెలిపారు పేదలకు వృద్ధులకు పండ్లు, స్వీట్లు కేకు, భోజనం షేక్ బాజీ సహకారంతో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర రెస్క్యూటీం దోర్నాల రామకృష్ణ నిస్సి, రామారావు, సుదర్శన్ పాల్గొన్నారు.