మధిర మున్సిపాలిటీ లో జ్వరం సర్వే చేస్తున్నా టీమ్ లను పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్

Published: Monday January 24, 2022
మధిర జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి మధిిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు ముర మున్సిపల్ కమిషనర్ పలు వార్డు కౌన్సిలర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పరిశీలించి మున్సిపాలిటీ పరిధిలోనీ పలు వార్డులలో జరుగుతున్న  ఇంటింటి జ్వరం సర్వే చేస్తున్నా సర్వే టీమ్ లను పరిశీలించి వారికి తగు సూచనలు ఇస్తున్న కమీషనర్ రమాదేవి గారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారికి మెడికల్ కిట్లు పంపిణీ చేయలని, పేషంట్ లకు తగు జాగ్రత్తలు తెలపాలని సర్వే టీమ్ లకు తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు, సామాజిక దూరం పాటిస్తూ రెండు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకోని వారు తప్పనిసరిగా రెండు డోస్ లు వేయించాలని, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని హోం ఇసోలేషన్ లో ఉండాలని వారికి తెలియజేయాలని సర్వే టీమ్ లకు తెలుపడం జరిగింది.