హైమాస్ట్ లైట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్ రావు

Published: Tuesday May 17, 2022
మేడిపల్లి, మే16 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లోని ప్రధాన కూడళ్లలో  హైమాస్ట్ లైట్స్ ఏర్పాటుకు స్థానిక కార్పొరేటర్ బంగారు శ్రీవాణి వెంకట్ రావు శ్రీకారం చుట్టారు.
డివిజన్లోని ప్రధాన కూడళ్ళలో వెలుతురు లేఖ సాయంత్రం కాగానే పలు కూడళ్లలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సంఘ విద్రోహ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని పలు కాలనీల ప్రజల ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ శ్రీ వాణి వెంకట్రావు సంబంధిత జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి హైమాస్ట్ లైట్లు సాంక్షన్ చేయించు ప్రస్తుతం 7 కూడళ్ళలో హైమాస్ట్ లైట్లు బిగించడానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు, ప్రధాన కార్యదర్శి సంకూరీ కుమారస్వామి, బొడ్డుపల్లి దానయ్య, వాకా నరసింహ రావు, నాసు సతీష్, వెంకటేష్, పాల్గొన్నారు.