మైసిరెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు మరమ్మతులు
Published: Saturday June 11, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 10 జూన్ ప్రజాపాలన: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు విద్యుత్ మరమ్మతులు చేశారు. ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా
బొమ్మలరామారం మండలం
మైసిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎలక్ట్రికల్ డ్రై డే సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో పక్కకు ఒరిగి పోయిన విద్యుత్తు స్తంభాలు, వేలాడే విద్యుత్తు తీగలను సరిచేయడం జరుగిందని గ్రామ ప్రత్యేక అధికారి గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో
జి. జ్ఞానప్రకాశ్ రెడ్డి, సర్పంచ్ నోముల రమాదేవి, పంచాయతీ కార్యదర్శి కె.భాను, లైన్ మెన్ సత్యనారాయణ, హెల్పర్ మహేష్, ఆశా వర్కర్ సుమీల, నాయకులు నోముల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: