మధిరలో ఘనంగా నిర్వహించిన శ్రీ కొణిజేటి రోశయ్య జన్మదినోత్సవ సంబరాలు

Published: Monday July 05, 2021
మధిర, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీశ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో 88వ జన్మదినోత్సవ వేడుకలు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, ఉభయ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఫౌండర్, తమిళనాడు మాజీ గవర్నర్, ఎన్నో దశబ్దాలుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన రాజకీయ కురువృద్ధుడు శ్రీ  కొణిజేటి రోశయ్య 88వ జన్మ దినోత్సవ సందర్భంగా ఈ రోజున శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో అధ్యక్షులైన కురువెళ్ళ కృష్ణ కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి నాళ్ళ శ్రీనివాసరావు, వాసవి కళ్యాణ మండపం మాజీ అధ్యక్షులు ఇరుకుల్ల నరసింహారావు, పుల్ల కాండం చంద్రశేఖర్, పి సత్యనారాయణ మూర్తి, మాధవరపు నాగేశ్వరరావు, మిరియాల రమనగుప్త, పల్లపోతు ప్రసాద్, దాచేపల్లి రాము, గుండెల ముత్తయ్య, చెడే రామకోటేశ్వరరావు, కుంచం కృష్ణారావు, వనమా వేణుగోపాలరావు, నంబూరు మురళి, మహంకాళి శ్రీనివాసరావు, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు