2 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ... తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల
Published: Monday October 17, 2022
జన్నారం, అక్టోబర్ 16, ప్రజాపాలన: మండలంలోని 132 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆదివారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్నారం మండలంలో 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్లో ఉండి మండలంలో 11 కెవి విద్యుత్ సరఫరా చేయడం వల్ల లో వోల్టేజ్ సమస్య మండల వాసులకు వస్తుందని ఆయన తెలిపారు. మండలంలోని విద్యుత్ వినియోగదారులు వ్యాపారస్తులు రైతులు విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లో వోల్టేజ్ సమస్య పూర్తిగా తీరాలంటే 132 కెవి విద్యుత్ సబ్ స్టేషను ఎర్పాటు చేయాలని అయన డిమాండ్ చేశారు.
Share this on your social network: