సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Published: Wednesday June 23, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : బీజేపీ రాష్ట్ర నాయకులు యం.రవి కుమార్ యాదవ్ సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాదాపూర్ గోకుల్ ప్లాట్స్ లోని నాయి బ్రాహ్మణులకు మహిళలకు దాదాపు 200 మందికి నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ లాక్ డౌన్ లో నాయి బ్రాహ్మణులకు పనిలేక చాలా ఇబ్బందులు పడుతుండగా, ఈ తెరాస ప్రభుత్వం వారికీ ఎలాంటి సహాయం చేయలేదన్నారు. నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 5000 /- రూ లను అందించాలని డిమాండ్ చేసారు. మీకు ఏ సహాయం కావాలన్నా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, బాలా కుమార్, మధన చారీ, రఘు, నాగరాజు, నరేష్, గోకుల్ ప్లాట్స్ లోని బీజేపీ కార్యకర్తలు  పాల్గొన్నారు.