శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
Published: Thursday July 08, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా సoస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వలిగొండ మండల కురుమ సంఘం మాజీ అధ్యక్షులు ఈతాప రాములు డిమాండ్ చేశారు.తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించిన దొడ్డి కొమురయ్యను తెలంగాణలో కొంతమంది అవమానించడం దురదృష్టకరమన్నారు. మహనీయులను అవమానించిన వారిని కఠినంగా శిక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
Share this on your social network: