వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ దినోత్సవం.

Published: Friday September 16, 2022

మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 15, ప్రజాపాలన:

 

జాతీయ ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ఇంజనీర్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. సాటిలేని మేటి ఇంజనీర్ అనిపించుకున్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని పలువురు ఇంజనీర్లను వాసవి క్లబ్స్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఏడీలు నూక రాజశేఖర్, రాచకొండ వెంకటేశ్వర్లు , ఏఈలు మంచాల శ్రీనివాస్, చాగంటి భాస్కర్, కేశెట్టి శ్రావణ్, ఈరంటి వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ కేశెట్టి దివ్య, సివిల్ ఇంజనీర్ మోటూరి వినీల్ ,ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ గడ్డం శరణ్య లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో

వాసవి క్లబ్ క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్, సెక్రెటరీ నాగిశెట్టి శ్రీనివాస్, జోన్ చైర్మన్లు కాసం సతీష్ , కుంకుముట్టి వెంకటేష్, నాగిశెట్టి జ్యోతి , వాసవీక్లబ్ అధ్యక్షులు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలుమాస్ ప్రవీణ్ , వనిత క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాసవి, కపుల్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమేష్ రమాదేవి పాల్గొన్నారు.