రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ
Published: Monday June 21, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రానికి చెందిన గోగు రాజు ఇటీవల ఆనారోగ్యంతో మరణించాడు. అతని స్నేహితులు రాజు పేరుతో పౌండేషన్ ని నిర్మించారు. ఆదివారం అతని పుట్టిన రోజు సందర్భంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు మరియు మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు ఫౌండేషన్ అధ్యక్షులు మైసొళ్ళ మచ్యగిరి మాట్లాడుతూ ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ యాట సంధ్య, అధ్యక్షులు మైసొల్ల మచ్చగిరి, విష్ణు, సురేష్, కిరణ్ కుమార్, భాష, కాటం రాజు, కుమార్, ఉపేందర్, శ్రీను, ఇమ్రాన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: