జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి అందుకున్న మురిమడుగుల రమేష్

Published: Wednesday September 07, 2022
జన్నారం, సెప్టెంబర్ 06, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలోని కలమడుగు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెందిన ఉపాధ్యాయులైన మురిమడుగుల రమేష్ జిల్లా ఉత్తమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా భౌతిక శాస్త్రం, అత్యున్నత సేవలు అందించినందుకు గాను, పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి విశేషంగా సేవలందించిన అందుకు గాను, మంచిర్యాల జిల్లా పాలనాధికారి విధ్యాదికారి, ఉపాధ్యాయుడు రమేష్ కు సన్మానం పోదడం జరిగింది. మంగళవారం నాడు ఉత్తమ బహుమతి పొందినందున మురిమడుగుల రమేష్ ను,పలువురు మండల విధ్యాదికారి విజయ్ కుమార్,  కలమడుగు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి ప్రభాకర్, కట్ట రాజమౌళి, ఎస్ఎమ్సి చైర్మన్ పాత లింగన్న, ఉపాధ్యాయుల బృందం, తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు అభినందించారు.
 
 
 
Attachments area