చేతిపంపు బాగుచేయించిన సర్పంచ్ కోట లక్ష్మి అశోక్

Published: Wednesday June 30, 2021

బెల్లంపల్లి, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మండలం బూదకలాన్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గత కొన్ని నెలలుగా బోరు పాడైపోయి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని వార్డ్ మెంబర్ ద్వారా తెలుసుకున్న సర్పంచ్ కోట లక్ష్మి రిపేరు చేయించి నీటి వసతి కల్పించినట్లు తెలిపారు. మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ బోర్ పాడైపోయి నీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల అవసరాలను గమనించి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడితో మాట్లాడి దగ్గరుండి బోరును రిపేరు చేయించి నీటి వసతి కల్పించామని, అడగగానే సిబ్బందిని పంపించి రిపేర్ చేయించి నందుకు ఎంపీపీ గోమాస శ్రీనివాసుకు సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు. చెప్పగానే అత్యవసరంగా బోరు రిపేరు చేయించి నీటి వసతి కల్పించినందుకు ఎస్సీ కాలనీ వాసులు వార్డ్ మెంబర్ కు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కోట అశోక్, వార్డ్ మెంబర్ కాంపెళ్లి వినయ్, స్థానిక యువకులు పాల్గొన్నారు.