న్యాయం జరిగే వరకూ విరమించేది లేదు
కల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత ఐదు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న మహిళలు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకూ దీక్షలు కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఎంపికలో కొంతమంది పేర్లు రాయకుండా ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న వారికే లాటరీ ద్వారా పేర్లు రాసి ఎంపిక చేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష చేస్తున్న సమయంలో తమలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారని, తమ ప్రాణాలు పోయినప్పటికీ దీక్షలు చేస్తూనే ఉంటామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమకు న్యాయం చేసే వరకు వీటిని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.*
Share this on your social network: