పోడు సాగు చేసుకునే వారందరికీ పోడుభూమి హక్కు పత్రాలు ఇవ్వాలి మాజీ ఎంపీ మీడియం బాబురావు. బూర్

Published: Tuesday October 11, 2022
 బూర్గంపాడు మండల పరిధిలో బుడ్డగూడెం పోడు భూముల సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు గారు పాల్గొని  గిరిజనులు 1996 నుండి సాగు చేసుకుంటున్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం పోడు భూమి దరఖాస్తులు చేసుకున్న వారందరికీ సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఇయ్యని ఎడల పెద్ద ఎత్తున పోడు సాగుదారులతో పోడు భూమి సాధించుకుంటామని అన్నారు.  బుడ్డగూడెం గ్రామ ప్రజల పైన కేసులు పెడతామని బెదిరిస్తున్న ఫారెస్ట్ అధికారులు పైన కేసులు పెట్టాలని గిరిజనుల  హక్కులను దుర్వినియోగం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూముల్లోకి గిరిజనులు వస్తే ఫారెస్ట్ వాళ్ళు కేసులు పెడతామని వారినే బెదిరించడం చాలా అన్యాయమని అన్నారు. 2005 అవతల సాగు చేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి బూర్గంపాడు మండలంలో పోడు సాగు దారులకు పట్టాలు ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా సర్వే చేయాలని పట్టాలు ఇవ్వాలని అధికారులను కోరారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ,గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు సున్నం గంగ, మీడియం పుల్లయ్య, కోర్స తిరుపతయ్య, కనితి అర్జున్ మీడియం శ్రీను వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.