దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
Published: Wednesday February 16, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 14 (ప్రజాపాలన ప్రతినిధి) రామంతాపూర్ దూరదర్శన్ కేంద్రాన్ని సోమవారంకేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సందర్శించారు. దూరదర్శన్ కేంద్రంలోని ప్రతి విభాగాన్నిఆయన పరిశీలించారు. అధికారులను సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దూరదర్శన్ లో ప్రసారమవుతున్న వివిధ కార్యక్రమాల వివరాలను కూడా మంత్రి తెలుసుకున్నారు. అనంతరం దూరదర్శన్, ఆకాశవాణి కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Share this on your social network: