వందలాది అమరుల త్యాగ ఫలం కోటి రతనాల తెలంగాణ : సర్పంచ్ పెంటమళ్ళ పుల్లమ్మ..

Published: Thursday June 03, 2021
పాలేరు, జూన్ 2, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా:-నేలకొండపల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం నిరాడంబరంగా నిర్వహించారు. పైనంపల్లిలో డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు జెండా ఎగురవేశారు. మార్కెట్లో చైర్మన్ సెట్రామ్ నాయక్ జెండా ను ఎగురవేశారు. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్.కందాళ లిల్లీ జెండాను ఎగురేశారు. మండలంలోని కోనాయిగూడెం, నేలకొండపల్లి పంచాయతీలో సర్పంచ్లు పెంటమళ్ల పుల్లమ్మ, రాయపూడి నవీన్ లు జెండాలు ఎగురవేశారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జెండా ఎగురవేశారు. ఆయా పంచాయతీల్లో జరిగిన సభల్లో తెలంగాణ ఆవిర్భావం ను వివరించారు. కోనాయిగూడెం లో జరిగిన సభలో కార్యదర్శి వీరబాబు. అంగన్వాడీ నాగమణి, ఆశా బేబి, సిబ్బంది ఆంజనేయులు, నాగరాజు, ఎమ్మార్పీఎస్. మండలాధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.