లంక కొండయ్య ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణి
Published: Monday December 13, 2021
మధిర డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో ప్రముఖ సామజిక సేవకుడు లంకా కొండయ్య నివాసం ఆజాద్ రోడ్ నందు మధిర మండలం అల్లినగరం గ్రామ నివాసులు కమ్మజనసంఘం సభ్యులు శ్రీ వట్టికొండ రేణుకా రఘరామ్ దంపతులు రఘరాం అత్త వట్టికొండ గిరిజ పేరు మీదగా నిరు పేద మహిళాల వృద్ధులకు చీరలు పంపిణి చేసినారు. ఈ చీరలను సేవా వికాసం డైరెక్టర్ పమ్మి రాజు గీత పార్థసారధి మరియు వట్టికొండ రేణుక లంకా కొండయ్య చేతులు మీదుగా పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి కడుపేదలను ఆదుకోవటం ప్రతి ఒక్కరి ధర్మం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లుగా అవంతి, గోపి, సాయి, అంజి వెంకీ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: