సిసి రోడ్ వేయబోయే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మేయర్

Published: Thursday June 10, 2021
బాలపూర్, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : దశలవారీగా పలు కాలనీల్లో అభివృద్ధి పనులు పూర్తవుతాయని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదవ డివిజన్లో కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత సమరసింహా రెడ్డి తో కలిసి స్థానిక కార్పొరేటర్ బొద్ర మోని రోహిణి రమేష్ ముదిరాజ్ లతో  బొడ్రాయి దగ్గరి నుండి చెరువులో ముంపు ప్రాంతమైన జారుడు బండ వరకు సిసి రోడ్ పనులను ప్రారంభించడానికి బుధవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..... పలు కాలనీలలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతుందని కాలనీవాసులు చింతించకూడదని హామీ ఇచ్చారు. కరోనా, లాక్ డౌన్ వల్ల పనులు లేట్ అయ్యాయని, ఇప్పుడు అతి తొందర్లోనే అభివృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. కుర్ములగుడా బొడ్రాయి నుండి ముంపు ప్రాంతమైన జారుడు బండ వరకు సిసి రోడ్డు పనులు తొందర్లోనే పూర్తవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ టేకుల మల్లారెడ్డి, మాజీ వార్డు నెంబర్ బొద్ర మోని అంజయ్య, కేసరి జగన్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ ముదిరాజ్, ఏ.రాజు గౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.