ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నే నియోజకవర్గం అభివృద్ధి. నేతకాని మహార్ నాయకుల ప్రశంస.

Published: Thursday December 29, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి నియోజకవర్గం అన్నివిధాల అభివృద్ధి చెందుతుంది అంటే, అందుకు ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్యే కారణమని నేతకాని మహర్ సంఘం నాయకులు అన్నారు. బుధవారం స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,గత  ప్రభుత్వాల హయాంలో బెల్లంపల్లి ఎంతో వెనుకబడిందని, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దుర్గం చిన్నయ్య, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. శాసనసభ సమావేశాల్లో, అనేకసార్లు నియోజకవర్గ  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,అభివృద్ధి కి నిధులు తీసుకొచ్చి, నియోజకవర్గ అభివృద్ధికి  కృషి చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లిలో 30పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడమే కాకుండా, అనేక ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, ఆయన చేసిన కృషికి నిదర్శనమని అన్నారు.
 గతంలో పనిచేసిన ఏ ఎమ్మెల్యే  ఇలాంటి అభివృద్ధి చేయలేదని,వారన్నారు. 
ఈ సమావేశంలో  నేతకాని మహర్ నాయకులు కలాలి నరసయ్య, కలాలి భీమయ్య, గోమాస రాజం, తదితరులు పాల్గొన్నారు.