గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి వృక్షార్చనలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావ
Published: Thursday February 18, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ధరూర్ క్యాంపులోని మాత శిశు కేంద్రం ఆవరణలో ఎమ్మెల్యే తో కలసి మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కోటి వృక్షార్చనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఆయన ఆశయాన్ని నెరవేరుద్దాం సీఎం జన్మదిన కానుకగా మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అధికారులు నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: