కల్లూరు మాజీ సర్పంచ్ జంగ లింబద్రికి ఘన నివాళులు

Published: Monday May 17, 2021
కోరుట్ల, మే 16, (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం లోని కల్లూరు గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ జంగ లింబాద్రి గత ఐదు రోజుల క్రితం పరమపదించినారు. అంబేడ్కర్ విగ్రహం దగ్గర ఆయనకు గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య మరియు యువకులు ఘనంగా నివాళి అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భం గా సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ మాజీ సర్పంచ్ లింబద్రి చేసిన సేవలను, ఆయన చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు రాజ్ కిషోర్, సురేష్, చంద్రశేఖర్, వార్డ్ నెంబర్ గంగాధర్, డీలర్ నర్సయ్య  శేఖర్, మనోజ్, కృష్ణ, నవీన్ ఇలియాస్, సద్దాం, దేవేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.