డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ, ఏమయే మంత్రిగారు

Published: Thursday June 17, 2021

జిన్నారం, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లాలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ, ఏమయే ముఖ్యమంత్రి అని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నిరూడి వీరస్వామి అన్నారు.ఆయన మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని, కాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్న కాలం గడుపుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆర్ధికమంత్రి తన్నీరు హరీష్ రావు డబల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.