క్రిస్మస్ వేడుకల్లో సన్మానానికి దరఖాస్తులు ఆహ్వానం
Published: Wednesday November 23, 2022
జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి డి. సుధారాణి
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజాపాలన : సామజిక సేవ , విద్యాబోధన, సాహిత్యం, కళలు, క్రీడారంగాలలో 10 ఏళ్లకు పైగా కృషిచేస్తున్న క్రైస్తవులు, అలాగే ౩౦ ఏళ్లకు పైగా సేవలందిస్తున్న క్రైస్తవ సంస్థల నుండి క్రిస్మస్ వేడుకలలో సన్మానించేందుకు అర్హులైన అభ్యర్థులు, సంస్థల నుండి ధరఖాస్తులు ఆహ్వనిస్తునట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని డి. సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో గౌరవ సత్కారం పొందేందుకు అర్హులైన అభ్యర్తులు, సంస్థలు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. నామినేషన్ ఫారాలు www.tscmfc.in వెబ్ సైట్ లో పొందవచ్చని తెలిపారు .దరఖాస్తులను డిసెంబర్ 8వ తేది సాయంత్రం 5 గంటల లోపు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయలన్నారు. వివరాలకు 9440685713 కు సంప్రదించాలని తెలిపారు.
Share this on your social network: