బీఎల్ఆర్ ట్రస్టు ద్వారా మేరు కులస్తుల సంక్షేమానికి సహకారం అందిస్తాం బండారు లక్ష్మారెడ్డి

Published: Monday December 19, 2022
మేడిపల్లి, డిసెంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ నియోజకవర్గంలోని మేరు కులస్తుల సంక్షేమానికి బీఎల్ఆర్ ట్రస్టు ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు లక్ష్మారెడ్డి తెలిపారు.

ఉప్పల్ నియోజకవర్గం మేరుకుల సంక్షేమ సంఘం కొత్త సంవత్సర (2023) క్యాలెండర్ ను బండారు లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.

నియోజకవర్గంలో వెనుకబడిన మేరు కుల ప్రజలకు విద్య ,వైద్యం, ఉపాధి అవకాశాలను తన ట్రస్ట్ ద్వారా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేరు కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శనిగారం రాము, ప్రధాన కార్యదర్శి మునిగాల సతీష్ కుమార్, కోశాధికారి సింగు విష్ణు తదితరులు పాల్గొన్నారు.