దగ్గుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తరలిన ప్రజలు..

Published: Saturday November 19, 2022
తల్లాడ, నవంబర్ 18 (ప్రజాపాలన న్యూస్):
  రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం తల్లాడ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు భారీగా తరలి వెళ్లారు. వినూత్న రీతిలో గొర్రె పోట్టెళ్లతో ప్రభల ద్వారా కార్యక్రమానికి హాజరయ్యారు. గొర్రె  పొట్టేళ్లతో ప్రభ బహిరంగ సభ వద్దకు వెళ్లడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.