సిపిఎం పార్టీ లో ఆదాం సేవలు మరువలేనివి : రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు

Published: Monday October 25, 2021
బోనకల్, అక్టోబర్ 24, ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండల పరిధిలోని కలకోట గ్రామంలో ఇటివల అనారోగ్య కారణంగా చనిపోయిన  సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు యంగల ఆదాం స్మారక స్థూపం వద్ద సంతాపం తెలియజేస్తూ సిపిఎం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆదాం కుటుంబ సభ్యుల ను పరామర్శించడం జరిగినది.  సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంతాప సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కలకోట గ్రామంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సిపిఎం జెండాను విడవకుండా  ముందుకు కొనసాగారని ఆదాం ను మండలంలో ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ ఏ పిలుపునిచ్చిన ప్రజా పోరాటంలో చురుగ్గా పాల్గొనేవాడని, తన తుది శ్వాస వరకు సిపిఎం జెండాను వీడలేదని అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం సీపీఎం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆదాం కుటుంబ సభ్యులకు సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మాజీ జడ్.పి. టి.సి, ఎంపీపీ కొమ్ము శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ చిట్టిమోదు నాగేశ్వరరావు, ఆళ్లపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల సెక్రెటరీ బంధం శ్రీనివాసరావు, కందికొండ శ్రీను, గుగులోతు పంతు, మందడపు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ఏసుపోగు బాబు, కిలారు సురేష్, గుగులోతు నరేష్ గార్లపాడు శాఖ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.