ఉప్పల్ భగాయత్ లో రియల్ విజన్ గ్రూప్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సినీనటుడు అలీ
Published: Thursday August 05, 2021
మేడిపల్లి, ఆగస్టు 4 (ప్రజాపాలన ప్రతినిధి) : రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజల మన్ననలు పొందుతున్న రియల్ విజన్ గ్రూప్ వారి నూతన కార్యాలయాన్ని ఉప్పల్ భగాయత్ శిల్పారామం దగ్గరలో ప్రారంభోత్సవం చేశారు. ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు అలీ, సినిమా డైరెక్టర్ వి.సముద్ర ముఖ్య అతిధిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా సంస్థ డైరెక్టర్లు గౌరీపతి రావు, బాలాజీ, సతీష్, శ్రీనివాస్ నాయక్, కృష్ణ ఎల్లా మాట్లాడుతూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈస్ట్ హైదరాబాద్ లో భాగంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి, భువనగిరి పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో అన్ని అనుమతులతో వెంచర్ లను అభివృద్ధి చేసి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేవిధంగా, అన్ని వసతులతో అందిస్తున్నామని తెలియజేశారు. ఈ రియల్ విజన్ గ్రూప్ ఎంతో మంది యువతకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నామని తెలిపారు.
Share this on your social network: