ఎమ్మెల్యే క్వార్టర్ లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
Published: Monday August 16, 2021
జగిత్యాల, ఆగస్టు 15 (ప్రజాపాలన ప్రతినిథి) : జిల్లా ఎమ్మెల్యే క్వార్టర్ లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జాతీయ జెండా అవిష్కరనచేసి అనంతరం టీఆరెస్ పార్టీ కార్మిక విభాగం, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పవన్ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయం వద్ద ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జాతీయ జెండా అవిష్కరించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు, అమరుల బలిదానాలు వల్ల 15 ఆగస్ట్ 1947 వచ్చిన స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి అయినా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని, దేశ అభివృద్ధి లో రాష్ట్రాల పాత్ర కీలకమని, రాష్ట్రంలో రైతులకు అనేక పథకాలు రూపొంచించిందని 50 వేల రుణమాఫీ అమలు అవుతుందని, రాష్ట్రంలో 13000 కంపెనీల పైగా ఏర్పడ్డాయని, ప్రభుత్వరంగంలో 1,20,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని అలాగే 57 సం, ఆసరా పెన్షన్ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభమయిందని అన్నారు. జగిత్యాల పట్టణం శాంతికి మారుపేరుగా ఉన్నదని, హిందు ముస్లిం,క్రైస్తవ సోదరులు అన్నదమ్ముల్లా ఉంటారని, పట్టణ శాంతి కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, మైనార్టీ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మహిళ పార్టీ అధ్యక్షురాలు కచ్చు లత, యూత్ జిల్లా అధ్యక్షుడు దావా సురేష్, పట్టణ యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, కౌన్సిలర్లు, నాయకులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: