ఆజాద్ కా అమృత మహోత్సవ న్యాయ సేవ అవగాహన సదస్సు

Published: Thursday October 07, 2021

బోనకల్, ప్రజాపాలన ప్రతినిధి, అక్టోబర్ 6 : మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మర్రి తిరుపతిరావు అధ్యక్షతన ఈరోజు ఆజాద్ కా అమృత మహోత్సవ న్యాయ సేవ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. జరిగిన ఈ సదస్సులో లాయర్  తేళ్లప్రోలు వెంకటరావు మాట్లాడుతూ ప్రజలలో చట్టాలపై అవగాహన ఉండాలని బాల్య వివాహాలు లేకుండా మహిళలపై దాడులు లేకుండా పాఠశాలకు వేళ్లని పిల్లలకు అవ్వగహన చట్టపరమైన కేసుల విచారణ జరుపుకునేందుకు అవగాహన కల్పించుకోవాలి అని న్యాయపరమైన సలహాల మేరకు ఇలాంటి సదస్సుల ద్వారా ప్రజలను చైతన్యవంతం పరుచుకునేందుకు సివిల్ జడ్జి ద్వారా గ్రామాల్లో పని చేస్తున్నా పేరాలగల్ వాలంటీర్స్ ద్వారా  న్యాయ సేవ కార్యక్రమాలు పొందాలని కొరారు. ఈ కార్యక్రమంలో పేరా వాలంటీర్స్ ఎం యశోద, టీ లక్ష్మి, ఎన్ సునీత, గ్రామ ప్రజలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.