నూతన జోనల్ విధానంతో ఉద్యోగుల కేటాయింపు : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Thursday December 16, 2021
వికారాబాద్ బ్యూరో 15 డిసెంబర్ ప్రజాపాలన : నూతన జోనల్ విధానం క్రింద ఉద్యోగుల కేటాయింపు పై ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి  మాట్లాడుతూ ఈ నెల 16 లోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ప్రక్రియ పూర్తి చేయాలని, 20వ తేదీలోగా ఉద్యోగుల కేటాయింపు ఆదేశాల తర్వాత వారం రోజుల్లో ఉద్యోగులు విధుల్లోకి చేరాలని ఆదేశించారు. ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో, ఉద్యోగుల నుండి తీసుకునే ఆప్షన్, సీనియారిటీ, ప్రాధాన్యతల జాబితా, కమిటీల సమావేశాలు ఆయా జిల్లాలకు కేటాయింపు మొత్తం ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేయాలని, అంతేకాక స్పెషల్ కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రేపటి లోగా శాఖల వారీగా జిల్లా, జోనల్ వారీగా ప్రక్రియ పూర్తి చేసి ఒక కాపీ తనకు పంపించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.