కవ్వాల్ గ్రామపంచాయతిలో డిఎల్పీఒ తనిఖీ

Published: Wednesday February 09, 2022
జన్నారం రూరల్ , పిబ్రవరి 08,  ప్రజాపాలన: మండల కవ్వాల్ గ్రామపంచాయతి కార్యాలయంలో మంచిర్యాల డిఎల్పిఓ ప్రభాకర్ రావు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాల వివరాలను పరిశీలించారు, అనంతరం గ్రామపంచాయతి చేపట్టిన అన్ని అభివృద్ధి పథకాల వివరాలను రికార్డులలో సక్రమంగా నమెాదు చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల పంచాయతీ అధికారి ఎస్, రమేష్, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.