15 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం పట్టివేత

Published: Tuesday June 28, 2022
సివిల్ సప్లై అధికారి డిప్యూటీ తహశీల్దార్ విజయేందర్
వికారాబాద్ బ్యూరో జూన్ 27 ప్రజా పాలన : 15 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వాహనాన్ని సీజ్ చేశామని వికారాబాద్ డిప్యూటీ తహసిల్దార్ విజయేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని మర్రి చెన్నారెడ్డి చౌరస్తాలో అనుమానాస్పద. వాహనాన్ని పరిశీలిస్తే, ఆ వాహనంలో 15 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం ఆచూకీ ఆనవాళ్ళు కనబడ్డాయని స్పష్టం చేశారు. చేవెల్ల మండల పరిధిలోని ఎన్కేపల్లి గేట్ సమీపంలో బాలు కీమారుడైన మెగావత్ శ్రీను 15 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు.