15 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం పట్టివేత
Published: Tuesday June 28, 2022
సివిల్ సప్లై అధికారి డిప్యూటీ తహశీల్దార్ విజయేందర్
వికారాబాద్ బ్యూరో జూన్ 27 ప్రజా పాలన : 15 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వాహనాన్ని సీజ్ చేశామని వికారాబాద్ డిప్యూటీ తహసిల్దార్ విజయేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని మర్రి చెన్నారెడ్డి చౌరస్తాలో అనుమానాస్పద. వాహనాన్ని పరిశీలిస్తే, ఆ వాహనంలో 15 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యం ఆచూకీ ఆనవాళ్ళు కనబడ్డాయని స్పష్టం చేశారు. చేవెల్ల మండల పరిధిలోని ఎన్కేపల్లి గేట్ సమీపంలో బాలు కీమారుడైన మెగావత్ శ్రీను 15 క్వింటాళ్ళ పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు.
Share this on your social network: