మల్లాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె.పూర్ణిమపై ఉన్నత అధికారుల విచారణ

Published: Friday June 11, 2021
మల్లాపూర్, జూన్ 10, (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండల కేంద్రంలో అటవీశాఖలో పనిచేస్తున్న సెక్షన్ అధికారి కె. పూర్ణిమ మండలంలోని అన్ని గ్రామాల రైతులను, మండలంలోని ప్రజా ప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆమె పనితీరుపై అటవీశాఖ ఉన్నత అధికారులకు ఆరోపణలు విన్నవించుకున్నారు. పై అధికారులు స్పందిస్తూ గురువారం మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యలయంలో ప్లయింగ్ స్క్వాడ్ కరీంనగర్ రేంజ్ అధికారి బుర్ర లత సెక్షన్ అధికారి కె.పూర్ణిమను విచారణ చేపట్టారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదులను రికార్డు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ యస్ అహ్మద్ హుస్సేన్, జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ రేంజ్ ఇంచార్జ్ మల్లాపూర్ అధికారి చంద్రమౌళి, ఎఫ్ బి ఓ మౌనిక, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.