ఇంటింటా ఆరోగ్య సర్వేలో మండల తహసీశీల్దార్ సుజాత

Published: Tuesday May 11, 2021

గుమ్మడిదల, మే 10, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల గ్రామంలో మండల తహశీల్దార్ సుజాత ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఏదైనా ఇంట్లో జ్వరంతో ఎవరైనా ఉన్నారా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. జ్వరం, దగ్గు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా మందుల కిట్ ను అందించనుంది. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడే ఈ మందులు వాడడం ద్వారా వ్యాధిని అరికట్టే అవకాశం ఉందని, అంతేకాదు ఆసుపత్రులపై ఒత్తిడి  తగ్గించే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు, జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి మెడికల్ కిట్స్ తో పాటు ప్రతి రోజూ వైద్యులు వారి ఆరోగ్య వివరాల తెల్సుకుంటారని, ఇంటి వద్దే రోగులకు చికిత్స అందించడం ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా కరోనా కట్టడికి అవకాశం ఉందని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కుమార్ గౌడ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...