టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖలు ఎన్నిక

Published: Thursday September 09, 2021
సెప్టెంబర్ 08 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల కేంద్రంలోని గణేష్ ఫంక్షన్ హాల్ లో బుధవారం టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గ్రామ శాఖలను ఎన్నుకున్నారు. పట్టణ శాఖ అధ్యక్షులుగా ఎమ్మె లింగస్వామి, ప్రధాన కార్యదర్శిగా దొంతరబోయిన నరేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. అనంతరం మండలంలోని పులిగిల్ల గ్రామ శాఖ అధ్యక్షులుగా బుగ్గ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా వడ్డేమాన్ శ్రీనివాస్,అక్కంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్,2వ సారి ప్రధాన కార్యదర్శిగా శంకరి సురేష్,నేమిలికాల్వ గ్రామ శాఖ అధ్యక్షులుగా వంగాల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా వంగాల నాగరాజు, దుప్పల్లి గ్రామశాఖ అధ్యక్షులుగా బాలగొని భిక్షం, ప్రధాన కార్యదర్శిగా నీల రవి లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొనపురి కవిత రాములు, ఎంపిటిసిలు పలుసం రమేష్, పలుసం అండాలు నర్సయ్య, సర్పంచులు జక్క వెంకట్ రెడ్డి, గుడిసె రాజేశ్వరి నర్సింహా, వంగాల భిక్షపతి, నాయకులు గంగదారి రాములు, మామిడ్ల రత్నయ్య, ఐటిపాముల ప్రభాకర్, సత్యనారాయణ, రవీంద్ర, ఎడవెల్లి శాంతి కుమార్, కట్టెల నర్సయ్య, పబ్బు స్వామి, కళ్లెం మారయ్య, సోమనబోయిన రమేష్, పోలేపాక సత్యనారాయణ, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్, భిక్షపతి, శ్రీశైలం, గడ్డం దశరథ, బెజ్జనబోయిన మహేష్, బొల్ల మహేష్, మనిమద్దె రాములు, నీల స్వాతి, బాలగొని ముత్తయ్య, ఎలుగు బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.