వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పోరేషన్జ్ అభివృద్ధి పనులు

Published: Friday February 12, 2021
బాలాపూర్: ప్రజపాలన: బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 22వ డివిజన్ కార్పొరేటర్ లిక్కి మమతా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సాయి ప్రభు హోమ్స్ కాలనీ లో మంచి నీటి పైప్ లైన్ 10 లక్షల వ్యయంతో కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..... అంచెలంచెలుగా కార్పొరేషన్ డెవలప్మెంట్ చేయడానికి పలు కాలనీవాసులు సహకరించాలని కోరారు. వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కాలనీ వాసులకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్న కార్పొరేషన్ అని కొనియాడారు. స్థానిక కార్పొరేటర్ లిక్కి మమత కృష్ణారెడ్డి మాట్లాడుతూ.... కాలనీవాసులకు సంపూర్తిగా కార్పొరేటర్ వారి సమస్యలను తీరుస్తున్నారు, ఎల్లవేళలా కార్పొరేటర్ మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, సాయి ప్రభూహోమ్స్ కాలనీ వాసులు కృష్ణ, సాగర్, అశోక్, ప్రసాద్, శ్రీనివాస్, అరవింద్, ఆనంద్,. చిరంజీవి, లింగా రెడ్డి, గౌతం, శివరాజ్, వినయ్, మహిళ సోదరీమణులు పాల్గొన్నారు.