బీజేపీ, బీఆర్ఎస్ దుర్మార్గపు పాలనను అంతమొందించాలి.. రాష్ట్ర మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్

Published: Saturday February 11, 2023
తల్లాడ, ఫిబ్రవరి 10 (ప్రజా పాలన న్యూస్): 
 
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న దుర్మార్గపు పాలనను ప్రజలంతా ఐక్యతగా ఉండి అంతమొందించాలని రాష్ట్ర మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా తల్లాడలో సంభాని హత్ సే  హాత్ జోడో  యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లాలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చి వాటి అమలు చేయటంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. అనంతరం తల్లాడ పట్టణంలో ఇంటింటికి తిరిగి పార్టీ స్టిక్కర్లను అంటించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, పట్టణ అధ్యక్షులు దగ్గుల నాగిరెడ్డి, నాయకులు కిరణ్, మజార్, రాఘవ, కార్యకర్తలు పాల్గొన్నారు.