రైతు రాజ్యం స్థాపకుడు సీఎం కేసీఆర్
Published: Monday January 10, 2022
సబితా ఆనంద్ పౌండేషన్ చైర్మన్ డాక్టర్ సబితా ఆనంద్
వికారాబాద్ బ్యూరో 09 జనవరి ప్రజాపాలన : రైతు రాజ్యం స్థాపకుడు సీఎం కేసీఆర్ అని సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ కొనియాడారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ కుమ్మర్పపల్లి గోపాల్ ముదిరాజ్ టేకుల బీడు తండాలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సబితా ఆనంద్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి సారిగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కెసిఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టి దేశ రైతాంగానికి మార్గదర్శి అయిండన్నారు. రైతు బంధు సంబురాల్లో భాగంగా పేద ప్రజలకోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: