ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయం

Published: Monday September 27, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తో పాటు భారతీయ జనతా పార్టీ శ్రేణుల పాదయాత్రతో టీఆర్ఎస్ సర్కారు పతనం అని బిజెపి తెలంగాణ రథసారథి పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపిటిసిల వ్యవస్థలను లెక్క చేయని కేసీఆర్ కు బుద్ది చెప్పాలినీ ప్రతి బిజెపి కార్యకర్తలు కంకణం కట్టుకున్నారని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఘనంగా సన్మానించిన మీర్ పేట్  37వ డివిజన్ కార్పొరేటర్ మోడల బాలకృష్ణ తో కలిసి జీఎస్ గాజుల మధు ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 30 వ రోజుకు చేరుకున్న సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దేనపల్లి చౌరస్తాలో శాలువాతో సన్మానించారు. పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని.... వరుణ దేవుడు కరుణించాలిని వేడుకున్నారు. 30 రోజుల పాటు పాదయాత్రలో.. యాత్ర మొత్తం వసతి విభాగాల్లో నిరంతరం పని చేస్తున్నా మోడల్ బాలకృష్ణ ను గాజుల మధు లను అభినందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.... టీఆర్ఎస్ సర్కారుకు ప్రజాప్రతినిధులు అంటే లెక్క లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కారు, మంత్రి హరీష్ రావు వ్యవహారశైలిని బండి సంజయ్  దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా మీర్పేట్ బాలకృష్ణ. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ప్రజాప్రతినిధులను కించపరుస్తున్నారని చెప్పారు. వెంటనే స్పందించి భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభం అయిన పాదయాత్ర అక్టోబర్ 2న ముగియనుందని చెప్పారు.