వికారాబాదులో వికసించనున్న కమలం
Published: Tuesday February 28, 2023
* మాజీ మంత్రి బిజెపి నాయకులు ఎ.చంద్రశేఖర్
వికారాబాద్ బ్యూరో 27 ఫిబ్రవరి ప్రజాపాలన : భారతీయ జనతా పార్టీ వికారాబాద్ నియోజకవర్గంలో తిష్ట వేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నదని మాజీ మంత్రి బిజెపి నాయకులు ఏ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ రామయ్య గూడా మద్గుల్ చిట్టంపల్లిలో ప్రజాగోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ కు వికారాబాద్ నియోజకవర్గ పాలక్ జీవిత రాజశేఖర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూతు స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రజల చెంతకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రజలకు చేరువగా ఉండి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు. ప్రజా సంక్షేమ పథకాలు అన్నింటిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు తుంగలో తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పాలక్ జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను పేరు మార్చుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంటున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్,జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి మండల ఇన్చార్జిలు సురేష్, శ్రీనివాస్ గౌడ్, మరాటి శివప్రసాద్ విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాధవరెడ్డి, ప్యాట శంకర్ శిరీష,మాధవి, బుస్సా శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: