స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులు పూర్తి చేయడమే లక్ష్యం

Published: Thursday September 22, 2022
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజా పాలన : స్పెషల్ డ్రైవ్ శాంతిషన్ పనులు త్వరలో పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులోని గాంధీ కాలనీ రెండవ వార్డుకు సంబంధించిన ధన్నారం గ్రామంలో పారిశుద్ధ్య పనులను చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ 28వ వార్డులోని చౌదరి కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ్యం పట్ల ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయరాదని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. కాలనీలలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడం, మురికి కాలువలను శుభ్రం చేయాలని తెలిపారు. 
అనంతరం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు దన్నారంలో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్య పనులను చైర్ పర్సన్ మంజుల రమేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. స్థానికులు కొన్ని సమస్యలను చైర్ పర్సన్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం విశేషం. స్థానిక కౌన్సిలర్ రాములు, మోముల రాజ్ కుమార్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మొహీనుద్దీన్, జవాన్లు వినోద్, ఆశయ్య, పారిశుద్ధ్య సేవకులు ఉన్నారు.