ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి *సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన వైస్ చైర్మన్
Published: Thursday April 06, 2023
ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు పంది. యాదయ్య తండ్రి మైసయ్య అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరడం జరిగింది. చికిత్స నిమిత్తం అయిన ఖర్చును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నుండి 32,000వేల చెక్కును మంజూరు చేయించారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, బి ఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు అల్వాల్ వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్ రావు చేతుల మీదుగా శాస్త్ర గార్డెన్స్ లో బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాలరావు మాట్లాడుతూ పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో వర్కాల శివరాజ్ గౌడ్, ఖానాపూర్ వార్డు అధ్యక్షులు పంది మహేందర్ పాల్గొనడం జరిగింది.
Share this on your social network: