గ్రామంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన ఎంపీ నామ నాగేశ్వరరావు

Published: Monday July 18, 2022

మోటమర్రి గ్రామానికి ఎంపీ నిధులతో 11 లక్షల రూపాయలు మంజూరుబోనకల్, జులై 18 ప్రజా పాలన ప్రతినిది:మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీ ఆర్ ఎస్ పార్టీ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు ఎంపీ ల్యాండ్స్ నుండి రూ. 11 లక్షల రూపాయలు మంజూరు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన ఎంపీ నామ నాగేశ్వరరావు ,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కి టీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో గ్రామంలో రెండు సీసీ రోడ్లు, శివాలయం నుండి స్మశానవాటిక వరుకు వెళ్లే దారికి మరమ్మతులు చేయడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు గుడిద వీరబాబు, శివాలయం చైర్మన్ గుడిద స్వామి, నాయకులు మంద నాగేశ్వరరావు, చిట్టూమోదు శ్రీను, కన్నెపొగు సురేష్, గ్రామ పార్టీ కార్యదర్శి బక్క కిరణ్, వార్డు మెంబెర్ మంద నరసింహ్మ, గుడిద నాగేశ్వరరావు, వడ్డేబోయిన వెంకన్న, గుడిద నాగేశ్వరరావు, షైక్ మీరా సాహెబ్, మంద హనుమంతు, పెరబత్తిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.