ఇంటి పైకప్పు ఉరి వేసుకొని ఆత్మహత్య శంకరపట్నం ఫిబ్రవరి 01 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Thursday February 02, 2023

శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామంలో మార్క తిరుపతి (58) అనే వ్యక్తి గురువారం ఇంటి పైకప్పుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడి భార్య  భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం తన భర్త వృత్తిరీత్యా  గౌడ కులస్తుడైన గత కొంతకాలంగా అనారోగ్యంతో  ఇంటి వద్దే ఉంటున్నాడు. 21 సంవత్సరాలు కొడుకు కొంత కాలం క్రితమే చనిపోవడంతో మానసిక ఒత్తిడికిలోనై  పక్షవాతం రావటంతో మంచాన పడ్డాడు. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పెళ్లి అయిన కుమార్తెలు ఉన్నారు.