కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి

Published: Wednesday January 19, 2022
కోటపల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్
వికారాబాద్ బ్యూరో 18 జనవరి ప్రజాపాలన : పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని కోట్ పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్ డిమాండ్ చేశారు. మంగళవారం కోటపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మండల అధ్యక్షుడు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులకు అన్యాయం చేసిందని, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, రైతుల పక్షాన ఉండి పెంచిన ధరలను తగ్గించే వరకు బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, పార్టీ జనరల్ సెక్రటరీ లాలయ్య, మండల ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఎంపిటిసిలు మహేష్ గౌడ్, బందయ్య, సర్పంచ్ వెంకటేశం, సీనియర్ నాయకులు నక్కల బందయ్య, మైబు, శివానందం, మల్లేశం, రాజు సదానందం, గౌరీశంకర్, శ్రీనివాస్, శ్రీనివాస్, రషీద్, యాదయ్య, మైనార్టీ అధ్యక్షుడు అన్వర్ యూత్ ప్రెసిడెంట్ విజయ్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.